యాచారం : మండల పరిధిలోని కూత వేటు దూరంలో ఉన్న పిసి తండా వాసుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. గత కొంత కాలంగా తండా వాసులకు సెల్ఫోన్ సిగ్నల్స్ లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. తండ వాసులకు పిసి తండాలో జీయో టవర్ ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం నుండి విద్యార్థులకు ఆన్ లైన్లో విద్యను అభ్యసించుటకు సిగ్నల్ లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ఈ కష్టాలను గుర్తించి.. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి జీయో అధికారులు ఈ ప్రాంతంలో జీయో టవర్ను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు.మరి కొద్ది రోజుల్లో టవర్ నిర్మాణ పనులను పూర్తి చేసి తండా వాసులకు పూర్తి స్థాయిలో సిగ్నల్ను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement