Friday, October 18, 2024

RR: చినుకు పడితే చాలు చిత్తడే.. ప్రధాన రోడ్లు జలమయం..

వికారాబాద్, జులై 15 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా వికారాబాద్ పట్టణం నడిబొడ్డున‌ ఉన్న అగ్నిమాపకేంద్రం రోడ్ లో రోడ్డు పూర్తిగా జలమయమైంది. ఈ కారణంగా ఈ మార్గం గుండా వెళ్లే ప్రధాన కళాశాలకు చెందిన సంబంధించిన విద్యార్థులు తమ దుస్తులపై నీరు పడి ఇబ్బందుల పాలయ్యారు. సాధారణంగా ఎప్పటికీ నీరు నిలవ ఉండే ఈ ప్రాంతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి సమస్యను పరిష్కరించాల‌ని స్థానికులు కోరుతున్నారు.

కోటిపల్లి ప్రాజెక్టులో ఇరుక్కుపోయిన వాహనాలు…
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోటిప‌ల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో తెలియక కొన్ని వాహనాలు వెళ్లి ఇరుక్కుపోయాయి. ప్రధానంగా ఈ ప్రాంతంకు చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందినవారు రావడంతో వాహనాలు పూర్తిగా ఇరుక్కుపోయాయి. సోమవారం ఉదయం 10గంటల వరకు ఆ వాహనాలు అలాగే ఉన్నాయి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement