Saturday, July 6, 2024

RR: కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ప్రజాపాలన – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కొత్తూరు, జులై 3(ప్రభ న్యూస్) : ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రస్ ప్రభుత్వమ‌ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్ తండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, జడ్పిటిసి శ్రీలత సత్యనారాయణ, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు అంబటి ప్రభాకర్, రవి నాయక్, మాజీ ఉప సర్పంచ్ దయానంద్ గుప్తా, దశరథ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందూరి శ్రీనివాస్, వీరమోని దేవేందర్ ముదిరాజ్, కర్రోళ్ల సురేందర్, గోవింద నాయక్, బోకుల రాజు, శ్రీరాములు, మల్లేష్, గ్రామ ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement