Thursday, September 19, 2024

కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఅర్ శంకుస్థాపన

కొత్తపేటలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) నిర్మాణ పనులకు సీఎం కేసీఅర్ శంకుస్థాపన చేశారు. మంగళవారం గడ్డిఅన్నారంలో కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ చుట్టూరా నాలుగు కార్పొరేట్ ఆసుపత్రులు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఒకే రోజు ఏకంగా మూడు ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం కేసీఅర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, సబితారెడ్డి.. మూసి రివర్ బోర్డు ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఇతర ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి దయానంద్, ఎగ్గే మల్లేశంతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement