Saturday, September 21, 2024

TG | స్పీకర్ ప్రసాద్ కుమార్ కు రాఖీ కట్టిన‌ బ్రహ్మకుమారి మధు

వికారాబాద్, (ప్రభ న్యూస్) : భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎంతో గొప్పది విలువైనదని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి నిలయంలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్ కు బ్రహ్మకుమారి మధు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ నిదర్శమని అన్నారు. ప్రతి అక్కచెల్లెలు అన్నకు రాఖీ కట్టడం ద్వారా ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతీయులందరూ అన్నదమ్ములన భావన ప్రతి మహిళలో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కే ప్రభాకర్ రెడ్డి, వికారాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ గోపాల్ బ్రహ్మకుమారిలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement