తాండూరు : కరోనా బారిన పడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని తాండూరు మహాసేవ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో మహాసేవ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా మహామ్మారి వల్ల మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంతవాళ్లే జంకుతున్నారని అన్నారు. అలాంటి వారికి మహాసేవ సంఘం ద్వారా కొవిడ్తో మృతి చెందిన వారికి వారి కుటుంబ సభ్యుల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు మహాసేవ సిద్దంగా ఉంటుందన్నారు. ఎవరైనా ధైర్యంగా మహాసేవ సెల్ నెంబర్లు 8297166782, 9440038798, 9908989035 లకు సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అంకిత్ అనురాగ్, టైలర్ రమేష్, చంటియాదవ్, ఎబినేజర్, రఘుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement