Monday, September 16, 2024

RR: రైలు కింద పడి.. గుర్తుతెలియని వ్యక్తి మృతి…

వికారాబాద్, జూన్ 3 (ప్రభ న్యూస్) : చిట్టిగిద్ద – వికారాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య చించల్పేట్ గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఒక గుర్తు తెలియని 20 సంవత్సరాల వ్య‌క్తి శవం లభించిందని వికారాబాద్ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సదరు వ్యక్తి ఏదో గుర్తు తెలియని రైలు కింద పడి చనిపోయినట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై రైల్వే పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతుని వద్ద అతని చిరునామాకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినట్లయితే స‌మాచారం తెలియజేయాల‌ని సీఐ రాజేద్రప్రసాద్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement