Thursday, September 12, 2024

TG | లిమ్స్ ఆస్పత్రిలో నర్సుపై డాక్ట‌ర్ లైంగిక వేధింపులు..

కందుకూరు (ప్రభ న్యూస్): పశ్చిమ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం ఘటన మ‌రువ‌క‌ముందే మరో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పిడిన ఘ‌న‌ట క‌ల‌క‌లం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు గేట్ కొత్తూరు సమీపంలోని లిమ్స్ ఆస్పత్రిలో నర్స్ పై ఓ వైద్యుడు లైగింక వేధింపులకు పాల్పడ్డాడు.

డాక్టర్ వేధింపులు భరించలేని బాధితురాలు మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి డాక్టర్ మార్కండేయులను నిల‌దీసేందుకు ఆస్పత్రికి వెళ్లింది. దీనిపై బాధితురాలు కందుకూరు పోలీసులకు సమాచారం అందించడంతో డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

హాస్పిటల్ కి ఎలాంటి పర్మిషన్ లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్ పెట్టి తన దగ్గర పనిచేసే పేదింటి మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు కూడ డాక్టర్ మార్కండేయులు ఇలా చేయగా హైదరాబాద్ నుంచి తరిమికొట్టారని అన్నారు.

ఒకరోజు క్రితం తనను లైగింక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు యాజమాన్యానికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇలాంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement