Tuesday, July 2, 2024

Rangareddy – బండ్లగూడ మేయర్ లతా పై మాజీ మేయ‌ర్ అనుచ‌రుల వీరంగం…

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు. హరిత మహోత్సవ కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముందే మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు మేయర్ లత పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేట్లపై దాడి చేశారు. పిడుగుద్దుల వర్షం కురిపించారు మహేందర్ అనుచరులు. ఎమ్మెల్యే ఎదుటే ఇరు వర్గాల మద్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. దీంతో బాధితులు రాజేంద్రనగర్ పీఎస్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఇటీవలే బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు, మాజీ మేయర్ మహేందర్ అనుచరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement