Friday, October 18, 2024

Ramagundam – సింగరేణిలో విషాదం – కప్పు కూలి ఇద్దరు దుర్మరణం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – పెద్దపల్లి : సైడ్ కప్పు కూలి ఇద్దరు సింగరేణి కార్మికులు మృత్యువాత పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం లోని సింగరేణి ఓసిపి 2 లో గని బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వాటర్ పైప్ లైన్ మరమ్మత్తులు చేస్తుండగా సైడ్ పై కప్పు ఒక్కసారిగా కూలడంతో కార్మికులు అందులో ఇరుక్కుపోయి శ్వాస ఆడక మృతి చెందారు.

ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ సాగర్ లు మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీసి గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. కార్మికులు మృతి చెందడంతో ఓసిపి 2 లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement