Monday, September 16, 2024

Ramagundam – ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి – సిపి శ్రీనివాస్

రామగుండం..కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆది గణపతిని వేడుకున్నట్లు తెలియజేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్, అడ్మిన్ డీసీపీ రాజు ఇతర అధికారులతో లతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నామన్నారు.

- Advertisement -

ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు , యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదేరీతిలో ఈరోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.

పూజా కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు గోదావరిఖని ఏసిపి రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్, ఆర్ ఐ సంపత్, ఆర్ఎస్ఐ శ్రావణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement