Saturday, September 21, 2024

TG | రాఖీ పౌర్ణమి.. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాఖీ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్టు హైదరాబాద్‌-2 డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి తెలిపారు.

ప్రత్యేక బస్సు ఈనెల 17న రాత్రి 7.15 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి బయల్దేరి కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా అరుణాచలం చేరుకుంటుందన్నారు. 19న మధ్యాహ్నం తిరిగి బయల్దేరి 20వ తేదీన హైదరాబాద్‌ చేరుకుంటుందని ఆయన చెప్పారు.

ఒక్కరికి టికెట్‌ చార్జీగా రూ.3,600 చెల్లించాలని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలను డిపో మేనేజర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement