ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీలో కాసేపటి క్రితమే నామినేషన్ వేశారు. సింఘ్వీ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అభిషేక్ సింఘ్వీ మను స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చారని అన్నారు.
- Advertisement -