Wednesday, September 18, 2024

Rajanna Siricilla – ఏం క‌ష్టం వ‌చ్చిందో దంపతులకు ….

భార్యను చంపి.. ఆపై భ‌ర్తి ఉరి
రాజ‌న్న సిరిసిల్లలో విషాదం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – సిరిసిల్ల – రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లో దూస రాజేశం (54) అనే వ్యక్తి భార్య లక్ష్మి (50)తో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, పెద్ద కొడుకు వేణు, మౌనిక వివాహం కాగా.. చిన్న కొడుకు వెంకటేష్ బిటెక్ చదువుతున్నాడు. అయితే రాజేశంకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు.

ఇక ఇక్కడి నుంచి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. సంతోషంగా వున్న వీరి జీవితంలో కుటుంబ కలహాలు నరకయాతనకు గురిచేశారు. గత ఆరు నెలల నుండి ఉపాధి లేకపోవడంతో తరుచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఏందో విషయంలో భార్య భర్తలిద్దరూ గొడవ పడేవారు. భార్య సూటి పోటి మాటలకు రాజేశం విసుగు చెందాడు. దీంతో బలమైన ఆయుధంతో మొహం పై కొట్టి చంపాడు. భార్యను చంపి వేశాడు . అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement