Tuesday, October 22, 2024

Challenge – గోవుల తరలింపు అడ్డుకుంటా … ద‌మ్ముంటే అపండి… ఎమ్మెల్యే రాజాసింగ్ స‌వాల్


జూన్ 17న బక్రీద్ సందర్భంగా ఇక గోవు కూడా చ‌నిపోకుండా తాను అడ్డంప‌డ‌తాన‌ని. ద‌మ్ముంటే త‌న‌ను అడ్డుకోవాల‌ని పోలీసుల‌కు స‌వాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గోవుల తరలింపు అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నాంప‌ల్లి లోని ఆయ‌న కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ, గోవధను అడ్డుకుంటే బుల్లెట్ దించుతా అని మ‌రో వ‌ర్గం బెదిరిస్తున్నారన్నారు. ఎవరి బుల్లెట్ ఎవరికి దిగుతుంతో చూసుకుందాం రండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరించడం ఆపాలని మండిపడ్డారు. గో రక్షణ చేస్తే షూట్ చేస్తామని కొంతమంది చెప్తున్నారని తెలిపారు. వాళ్లకు నా ఛాలెంజ్… ఎవరిలో దమ్ము ఉందో చూసుకుందామన్నారు.

ఇక గోవధ చేయవద్దని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. ఇత‌ర ప్రాంతాల నుంచి సైతం హైదరాబాద్ కు యధేచ్చగా గోవులను తరలిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గోవుల తరలింపు, హత్యలను అడ్డుకునే హిందూ కార్యకర్తలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. . పోలీసులు పనిని హిందూ కార్యకర్తలు చేస్తుంటే వాళ్ళను సపోర్ట్ చేయకుండా బెదిరింపులకు దిగడం ఏంటని ? పోలీస్ ఉన్న‌తాధికారుల‌ను రాజాసింగ్ నిల‌దీశారు. హిందూ కార్యకర్తలపై రౌడీ షీట్ పెడతారా ? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement