Sunday, September 8, 2024

MDK: రాహుల్ గాంధీ ప్రజల మనిషి.. మంత్రి కొండా సురేఖ…

పటాన్ చెరులో జ‌న్మ‌దిన వేడుక‌లు
ప్ర‌భుత్వ హాస్పిట‌ల్లో పండ్లు పంపిణి
నేడు జ‌న్మించిన పిల్లల‌కు న‌గ‌దు రివార్డ్
కాంగ్రెస్ నేత నీల మ‌ధు విత‌ర‌ణ

రాహుల్ గాంధీ ప్రజల మనిషని, బీజేపీ అరాచక పాలనను ఎండగడుతూ అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని పటాన్చెరువు పట్టణ అధ్యక్షులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నీలం మధు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ముగ్గురు పిల్ల‌ల‌కు న‌గ‌దు రివార్డ్ – నీలం మ‌ధు

రాహుల్ గాంధీ జన్మదినమైన జూన్ 19న పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జన్మించిన పిల్లలకు ఒక్కొక్కరికి రూ. పదివేల ను ప్రకటించారు. బుధవారం జన్మించిన ఒక మగ బిడ్డకు మంత్రి సురేఖ చేతుల మీదుగా పదివేల రూపాయల చెక్కును అందజేశారు. రాహుల్ జన్మదిన సందర్భంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం పట్ల నీలం మధును మంత్రి కొండా సురేఖ అభినందించారు.

- Advertisement -


అనంతరం నీలం మధు మాట్లాడుతూ భారత దేశ ఉజ్వల భవిష్యత్తుకు రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమన్నారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగి భారత్ ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల అందరిని ఏకం చేసి వారి మనసులను గెలుచుకున్న ఘనత రాహుల్ కి దక్కుతుందన్నారు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ దేనని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొల్లూరు మల్లేష్, చంద్రారెడ్డి,సదర్ మల్లేష్, యూసుఫ్,గుండ్ల మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మండలాధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement