Thursday, September 26, 2024

TG: రేషన్ షాపులు కేటాయించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన..

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని మాజీ రేషన్ డీలర్లు జిల్లా కేంద్రంలో గురువారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన 58రేషన్ షాపులను తమకే కేటాయించాలని గతంలో రేషన్ డీలర్లుగా పనిచేసిన 30 మంది జిల్లా కేంద్రంలోని సాయి నగర్ వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిళ్ల‌తో నిరసన తెలిపారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేయడంతో చాలాసేపటికి కిందికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కలెక్టర్ వెంటనే రావాలని, పోలీసులు పైకి రావడానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అక్రమంగా నియమించిన రేషన్ డీలర్ షాపుల భర్తీని వెంటనే రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement