Sunday, September 15, 2024

TS | నేడు కామారెడ్డి, తాండూరులో ప్రియాంక పర్యటన

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : సార్వ త్రిక ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన శనివారం నాడు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనలో ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి కూడా పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు పటాన్‌చెరులో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో జరిగే జన జాతర బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 3.15 గంటలకు కామారెడ్డి రోడ్‌ షోలో ప్రియాంక పాల్గొంటారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున్‌ ఖర్గే శుక్రవారం తెలంగాణలో పర్యటించారు. ఉదయం తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండ పార్లమెంట్‌ పరిధిలోని నకిరేకల్‌లో జరిగిన జనజాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయితే, మరో అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో మూడు విడతలుగా ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement