Thursday, October 24, 2024

NZB | ప్ర‌జ‌ల క్షేమం కోసం అయ్యప్పను ప్రార్థించండి.. మాజీ మంత్రి వేముల‌

భీమ్‌గల్ రూరల్, అక్టోబర్ 24 ఆంధ్రప్రభ : పాదయాత్రగా శబరి బయలుదేరి కొంపల్లి చేరుకున్న భీమ్‌గల్ మాజీ ఎంపీపీ మహేష్, అలాగే ఇతర స్వాములను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క‌లిశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడవ సారి ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధిస్తే పాదయాత్రగా శబరికి వస్తానని మొక్కుకున్న భీమ్‌గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ చేంగల్ గ్రామం నుండి 5 రోజుల క్రితం పాదయాత్ర ప్రారంభించి బయలుదేరి గురువారం కొంపల్లికి చేరుకోవడంతో వారిని కొంపల్లి రాముని దేవాలయం లో కలిసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మహేష్ తో పాటు పాదయాత్రగా బాసర, మానాల, పడకల్ గ్రామాలకు చెందిన స్వాములు ఉన్నారు.

స్వాములతో కలిసి రామాలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో వేముల ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడుతూ… పాదయాత్రలో జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా రాత్రిపూట తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్వాములను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ శుభిక్షంగా ఉండాలని ఆ శబరిమల అయ్యప్పను నా తరపున ప్రార్థించండి అని అన్నారు. ఆ అయ్యప్ప స్వామి దయతో మీ శబరిమల పాదయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గురువారం కొంపల్లి రామాలయంకు పాదయాత్రగా చేరుకుంటున్న స్వాములకు ఎమ్మెల్యే వేముల భిక్ష ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement