Thursday, October 24, 2024

Breaking | ఏసీబీ వలలో పీఆర్ ఈఈ

రూ. 20,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ రైడ్ జరిగింది. భూపాలపల్లి పంచాయతీ రాజ్ ఈఈ దిలీప్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రోడ్డు పనుల బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టర్ వద్ద లంచం డిమాండ్ చేశారు.

రూ.20వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇంకా పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement