Tuesday, September 17, 2024

Ponnam – ఇది నిర్లక్ష్యం కాదు.. ప్రకృతి విపత్తు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, రంగారెడ్డి : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు వ‌చ్చాయ‌ని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదని.. ఇది ప్రకృతి విపత్తని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం జంట జలాశయాలను పరిశీలించిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వరదల్లో మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లిందే లేద‌ని, కానీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం లేఖ రాశారు… సాయం చేయ‌మ‌ని చెప్పండి
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, నిధుల కోసం కలిసి పోరాడుదామ‌ని అన్నారు. జంట జలాశయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement