Saturday, September 7, 2024

Pinapaka – పెద‌వాగు చెక్ డ్యామ్ లో మ‌త్య్స‌కారుడు గ‌ల్లంతు …

పి‌నపాక,జూలై 21,(ప్రభ న్యూస్):వాగులో చేపలు పట్టడానికి వెళ్ళి వ్యక్తి గల్లంతు అయన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం… మండలంలోని పోట్లపల్లి పంచాయితీ గ్రామనికి చెందిన పాయం నాగేశ్వరరావు (26), గ్రామ సమీపంలోని పెద్దవాగు చెక్ డ్యాం వద్ద మరో వ్యక్తి కలిసి, చేపలు పట్టడానికి వెళ్ళారు.ఈ క్రమంలో వాగు వరద‌ ఉధృతి పెరగడంతో, మునిగిపోయారు. మరో వ్యక్తి ఈత కోట్టుకోని వాగు ఒడ్డుకు చేరుకున్నాడు.

వాగులో పాయం నాగేశ్వరరావు మునిగిపోయాడని,స్థానికులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏడూళ్ళ ఎస్.ఐ రాజ్ కూమర్,ఎంపిడిఓ రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. సహయక,చర్యలు చేపట్టారు. మృతుడి కోసం గజ ఈత గాళ్ళుతో గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement