Friday, September 20, 2024

Peddapalli – మాజీ రైల్వే ఉద్యోగి హత్య

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ – మాజీ రైల్వే ఉద్యోగి హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి, కొలనూరు గ్రామాల మధ్య గల రహదారిపై చోటుచేసుకుంది. గురువారం రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కలవీన రాజేశం ను తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. గ్రామస్తుల సమాచారం మేరకు పెద్దపల్లి ఏసీపి గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు లు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కుమారుడు సాయి కృష్ణ కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ. రెండు గ్రామాల మధ్య గల రహదారిపై హత్య జరగడం సంచలనంగా మారింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement