Friday, September 20, 2024

Peddapalli – మాజీ హోంగార్డు దారుణ హత్య …

ఓదెల, ఆంధ్రప్రభ మాజీ హోంగార్డు హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్ ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. భూ వివాదం వల్లే హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా మృతుడు విజయ్ కి భూమి విషయంలో పలువురు కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతుందని తెలిసింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసిపి కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసిపి కృష్ణ తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement