Saturday, September 7, 2024

పెద్దపల్లిలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి…చైర్ పర్సన్ మమతా రెడ్డి..

పెద్దపల్లి రూరల్, ఆగష్టు 13(ప్రభ న్యూస్): ఈనెల 15న ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హార్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మున్సిపల్ వార్డు అధికారి, మెప్మా ఆర్ పి ద్వారా ప్రతి ఇంటికి జెండాల పంపిణీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement