Sunday, September 8, 2024

Peddapalli – అభివృద్ధి చేశాం.. అండగా ఉండండి – .. మున్సిపల్ చైర్ పర్సన్ మమత

పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అండగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత దాసరి మమతారెడ్డి కోరారు. మంగళవారం 11వ వార్డులో గడపగడపకు ప్రచారం నిర్వహించి గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ల సహకారంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, అధికారం కోసం కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తుందని నమ్మి మోసపోవద్దన్నారు. గులాబీ పార్టీకి మరోసారి మద్దతు ఇవ్వాలని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement