Sunday, October 6, 2024

Peddapalli – సెప్టిక్ ట్యాంక్ లో పడిన బాలుడు – …పరిస్థితి విషమం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ – సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మంగళ వారం మహబూబాబాద్ కు చెందిన కూలీలు రాములమ్మ శ్రీనివాసుల ఏడేళ్ల కుమారుడు విలియమ్స్ ప్రభుత్వాసుపత్రి లోని సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. గమనించిన సిబ్బంది సెప్టిక్ ట్యాంకు నుండి బాలుడిని వెలికి తీశారు. అప్పటికే సెప్టిక్ ట్యాంక్ లోని మురుగునీటిని బాలుడు మింగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రాథమిక చికిత్స జరిపే క్రమంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు కరీంనగర్ కు తరలించారు.

బాలుడి తండ్రి శ్రీనివాస్ విరోచనాలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆడుకుంటుండగా బాలుడు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సెప్టిక్ ట్యాంక్ హోల్ తెరిచి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement