Thursday, October 17, 2024

Peddapalli సెప్టిక్ ట్యాంక్ లో పడ్డ బాలుడు మృతి

పెద్దపల్లి, ఆంధ్రప్రభసెప్టిక్ ట్యాంక్ లో పడి చికిత్స పొందుతున్న బాలుడు బుధవారం మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళ వారం మహబూబాబాద్ కు చెందిన కూలీలు రాములమ్మ శ్రీనివాసుల ఏడేళ్ల కుమారుడు జాన్ వెస్లీ ప్రభుత్వాసుపత్రి లోని సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయి తీవ్ర అస్వస్థతకు ముగ్గురు కావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. వెంటిలేటర్ పై ఉన్న బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి.

బతుకుదెరువు కోసం వస్తే కడుపుకోత మిగిలిందని వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సెప్టిక్ ట్యాంక్ హోల్ తెరిచి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని వారిపై కఠన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement