Saturday, June 29, 2024

Ramoji Rao : రామోజీరావు పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) కూడా నివాళులర్పించారు. రామోజీ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. రామోజీరావుతో తనకు అనుబంధాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. రామోజీరావు మరణం తీరని లోటన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement