Sunday, September 8, 2024

జనసేన పార్టీ కార్యకర్తలబీమాకు పవన్‌ కళ్యాణ్‌ రూ. కోటి విరాళం

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమాకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ. కోటి విరాళం ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, కోశాధికారి ఎవి రత్నంకు అందజేశారు. క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి బీమా సౌకర్యం కల్పించడానికి గానూ ఏటా కోటి రూపాయల ను పవన్‌ విరాళం గా ఇస్తున్నారు. విరాళం ఇవ్వడం ఇది మూడో సంవత్సరం . ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొంటున్న పార్టీ వాలంటీర్లకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళుతున్న కార్యకర్తలు, వీర మహిళలు , జనసైనికులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement