Thursday, September 19, 2024

Passing Out Parade – ఆకాంక్ష‌లను నెర‌వేరుస్తాం – నూత‌న ఎస్సైల‌తో సీఎం రేవంత్‌

ట్రెయినీ ఎస్సైల‌కు మెడ‌ల్స్ అంద‌జేత‌
తెలంగాణ పోలీస్ అకాడ‌మీలో కార్య‌క్ర‌మం
స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ల పాసింగ్ అవుట్ ప‌రేడ్‌
547 మందితో పాసింగ్ అవుట్ ప‌రేడ్‌
వీరిలో 145 మంది మహిళా ఎస్సైలు
స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ మూడో బ్యాచ్ శిక్ష‌ణ పూర్తి
పోలీస్ స్కూల్ ఏర్పాటుకు 50 ఎక‌రాలు
రాబోయే రెండేళ్ల‌లో స్కూల్ నిర్మిస్తాం
స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రిలీఫ్ ఫండ్‌కు 11 కోట్ల విరాళం
చెక్కు అందజేసిన డీజీపీ జితేంద‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధ‌వారం సబ్ ఇన్​స్పెక్టర్ల మూడో బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్​ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సీఎం మెడల్స్‌ అందించారు. పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని, రాబోయే రెండేళ్లలో పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసు సిబ్బంది పిల్లలు ఒకేచోట చదువుకోవాలని సూచించారు. అంతకుముందు పోలీస్ విభాగం తరఫున 11 కోట్ల 6 లక్షల 83 వేల 571 రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు రేవంత్​రెడ్డికి చెక్​ను అందజేశారు.

ఆకాంక్ష‌లను నెర‌వేరుస్తాం..
గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, తెలంగాణలో డిసెంబర్‌ 3న ప్రజాపాలన ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక 30 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించామని, మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు. కొత్తగా గ్రూప్‌-1, 2, 3, డీఎస్సీ, పారామెడికల్‌ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని వ్యాఖ్యానించారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉందని, ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా ఇస్తోందని చెప్పారు.

గంజాయి, సైబ‌ర్ నేరాల‌పై ఉక్కుపాదం..

అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే ఇబ్బందవుతుందని చాలామంది వాయిదా వేయాలని కోరారు. గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకున్నాం. సైబర్‌, గంజాయి నేరాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో వ్యసనాలకు తావు లేదు. కులవృత్తులతో పాటు చేతి వృత్తులను బలోపేతం చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించాం. రైతులు ఆత్మగౌరవంతో తల ఎత్తుకునేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేశాం అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

547 సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్
పాసింగ్ అవుట్ పరేడ్‌కు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మొత్తం 547 సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. వీరిలో 145 మంది మహిళా ఎస్సైలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 శిక్షణ ఉద్యోగుల్లో 401 మంది సివిల్​ ఎస్సైలు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 547 మందిలో 472 మంది గ్రాడ్యుయేట్స్​, 75 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది బీటెక్​ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్ కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ భాగ్యశ్రీ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement