Friday, September 20, 2024

TG | వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని అరెస్ట్

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ యజమాని ప్రభాకర్‌ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఓ యువతి పెళ్లి పేరుతో మోసం చేయడంతో పాటు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రభాకర్‌ రెడ్డి పై 417, 420, 354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేశాడంటూ ఓ యువతి ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement