Saturday, September 7, 2024

TS: ట్రాక్టర్‌ ఢీకొని.. ఒకరు మృతి…

అచ్చంపేట, జూన్‌ 7, ప్రభ న్యూస్ : ట్రాక్టర్‌ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతిచెందిన ఘటన బల్మూర్‌ మండలం, మైలారం గ్రామ శివారులో జరిగింది. బల్మూర్‌ ఏఎస్‌ఐ రేణయ్య తెలిపిన వివరాల మేరకు…. మైలారం గ్రామానికి చెందిన కటికర్ల చంద్రయ్య (45) మైలారం గ్రామ శివారులోని అంబగిరి గ్రామానికి వెళ్లే రోడ్డు మలుపు ప్రక్కన వుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ అదుపు తప్పి కటికర్ల చంద్రయ్యపైకి దూసుకురావడంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

మృతునికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య అలివేల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ డ్రైవర్‌ మూడావత్‌ సైదులు (25) పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement