Monday, September 16, 2024

One More – హస్తం పార్టీ వైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడుగులు

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : ఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన శనివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. దీంతో త్వరలో ఎమ్మెల్యే మహిపాల్ పాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిపాల్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరితే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరనుంది.

కాగా, శనివారం మధ్యాహ్నమే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫొటోలను స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేరుతున్నారని ప్రచారం జరిగింది.

- Advertisement -

తాజాగా, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మరో ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement