Tuesday, October 22, 2024

TG | లారీ ఢీకొని వృద్ధురాలు మృతి…

నేరడిగొండ, (ప్రభ న్యూస్) : నేరడిగొండ మండలం దేవులతండా గ్రామ జాతీయ రహదారి వద్ద లారీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. వివరాల ప్రకారం…. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధూప్య తండా గ్రామానికి చెందిన జాదవ్ తుకారాం తన భార్య జీజాబాయితో కలిసి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దేవులతండా గ్రామంలో తమ కుమార్తె వద్దకు ప‌య‌న‌మ‌య్యాడు.

ఇంతలో దేవులతండా జాతీయ రహదారిపై వారు రోడ్డు దాటుతుండగా… నేరడిగొండ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న లారీ తుకారాం భార్య జీజాబాయిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement