Friday, October 18, 2024

TG | మంత్రి కొండా సురేఖపై అసభ్యకర పోస్ట్.. ఇద్దరి అరెస్టు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఫొటోల మార్ఫింగ్‌ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పేర్కొన్నారు.

ఎంపీ రఘునందన్‌రావు ఫిర్యాదు మేరకు అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. తనపై, మంత్రి కొండా సురేఖపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌తో పాటు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఎంపీ రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు.

కేటీఆర్‌, హరీశ్‌రావులతో పాటు పలు యూట్యూబ్‌ ఛానళ్లపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సైబర్‌ క్రైమ్‌తో పాటు దుబ్బాక పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.

మహిళలను అవమానించడం సరైన పద్ధతి కాదని ఎంపీ మండిపడ్డారు. మంత్రిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారు ఎంత పెద్దవారైనా శిక్షపడేలా చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక అక్క, తమ్ముడి వయసులో ఉన్న వారిని ట్రోల్‌ చేయడం సరికాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement