Friday, October 18, 2024

NZB | కారు ఢీ కొని ఒకరి మృతి..

మాక్లూర్, (ఆంధ్రప్రభ ): కారు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాక్లూర్ మండలంలో చోటుచేసుకుంది. మాక్లూర్ ఎస్సై కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని తూనికల కొలతల విభాగంలో పనిచేస్తున్న సుమన్ (37) గురువారం రాత్రి విధులు ముగించుకుని త‌న బైక్ పై ఆర్మూరు పట్టణంలోని పెర్కిట్‌లోని తన ఇంటికి వెళ్తుండ‌గా… 63వ నెంబరు జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో సుమన్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement