Tuesday, September 17, 2024

TG | బోనాలకు రండి.. సీఎస్ శాంతికుమారికి ఆహ్వానం

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ఇటీవల బోనాలు ఘనంగా జరిగాయి. ఇక‌ జూలై 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఉజ్జయినిలో జరిగే బోనాల జాతరకు రావాల్సిందిగా ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement