Monday, October 21, 2024

NZB : 2న వేల్పూర్ స్పైస్ పార్క్ వేదికగా సీఎం బహిరంగ సభ

వేల్పూర్, అక్టోబర్ 29(ప్రభ న్యూస్)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో నవంబర్ 2న జరిగే సీఎం కేసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని స్పైస్ పార్క్ వేదికగా జరగనున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ‌క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

బాల్కొండ నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా జరుగుతున్న ఏర్పాట్లలో పలు సూచనలు చేశారు. సీఎం సభాస్థలి, పార్కింగ్,హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించి సభా ఏర్పాటు పరిశీలకులకు పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement