Friday, September 20, 2024

TG: నిమ‌జ్జ‌నాల‌కు నో ప‌ర్మిష‌న్‌.. హుస్సేన్‌సాగ‌ర్ చుట్టూ ప్లెక్సీలు..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైదరాబాద్ ట్యాంక్ బండ్ స‌మీపాన‌ హుస్సేన్ సాగర్​లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేద‌ని అధికారులు ప్ర‌క‌టించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్, జీహెచ్​ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్​లో వేయకుండా ట్యాంక్​బండ్​ చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాట్లు చేశారు. మ‌రో ప‌క్క నిమ‌జ్జ‌నానికి ముమ్మ‌ర ఏర్పాట్లు చేశారు.

ఓ లాయ‌ర్ పిటిష‌న్‌తో…
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టులో విచారణ జ‌రుగుతుంది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినా, అమలు చేయట్లేదని లాయర్‌ వేణుమాధవ్‌ పిటిషన్‌ వేశారు. ఈ మేరకు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు హైడ్రా బాధ్యత ఉంద‌ని, హైడ్రాను ప్ర‌తివాదిగా చేర్చాల‌ని ఆయ‌న ధ‌ర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement