Monday, October 7, 2024

NZB | కార్యకర్తలకు కష్టం వస్తే అండగా ఉంటా : ఎంపీ అర్వింద్

నిజామాబాద్ ప్రతినిధి ( ప్రభ న్యూస్) : బూత్ స్థాయి కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా.. అండగా ఉంటానని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఆపదలో ఉన్న బూత్ స్థాయి కార్యకర్తలకు నేనున్నానంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ అండగా నిలిచారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించి ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి అండగా నిలిచారు.

సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అర్వింద్ ధర్మపురి కార్పస్ ఫండ్ – బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా పార్లమెంట్ పరిధిలోని వివిధ నియో జకవర్గాలకు చెందిన 21 బూత్ స్థాయి కార్యకర్తల కుటుంబాలకు 8.80 లక్షల చెక్కులను బాధ్యత కుటుంబాలకు అందజేసారు.

2021 సెప్టెంబర్ 17వ తేదీన నిర్మల్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా అర్వింద్ ధర్మ పురి కార్పస్ ఫండ్ – బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రారంభించారు…. దీని ద్వారా ఎంపీ అర్వింద్ ఇప్పటి వరకు 186 మంది బూత్ స్థాయి కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ…. కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటానన్నారు. కార్యకర్తలను ఆపదలో ఆదుకోవడం అదృష్టంగా భావిస్తానన్నారు. ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పలు బాధిత కుటుంబాల కుటుంబ సభ్యులు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement