Friday, October 4, 2024

NZB: ఎందుకు ఈ రహస్య సమావేశం…

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 3(ప్రభ న్యూస్) : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా.. సమాచారం ఇవ్వం.. అంతా మా ఇష్టం అన్న చందంగా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మీడియాకు సమాచారం లేకుండా గోప్యంగా మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

శనివారం నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్, కార్పొరేషన్ కమిషనర్, డిప్యూటీ మేయర్, అర్బన్ ఎమ్మెల్యే , కార్పొరేటర్లతో కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. కౌన్సిలింగ్ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇవ్వకుండానే సమావేశం నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి. గతంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి లోనికి అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ సారి సమావేశానికి లోనికి అనుమతి సంగతి పక్కన పెడితే… సమావేశం నిర్వహిస్తున్నట్లు కనీసం మీడియాకు సమాచారం ఇవ్వలేదు.

అసలు కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది?
నిజామాబాద్ నగర అభివృద్ధిపై కమిషనర్, మేయర్, ఎమ్మెల్యే కార్పొరేటర్లతో నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ సమావేశం గోప్యంగా ఎందుకు నిర్వహిస్తున్నారు. అసలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది. కౌన్సిల్ సమావేశం కొనసాగుతుండగానే ఒక కార్పొరేటర్ సమావేశాన్ని బైకాట్ చేసి వెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా సమావేశానికి కొందరు మైనార్టీ కార్పొరేటర్లు గైరాజరయ్యారు.

- Advertisement -

కార్పొరేషన్ ఇష్టారాజ్యం..
నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కౌన్సిలింగ్ సమావేశానికి ఒకరోజు ముందు మీడియాకు సమాచారం ఇస్తారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గోప్యంగా కౌన్సిలింగ్ సమావేశం నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement