Tuesday, September 17, 2024

NZB | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎంపీ అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, (ప్రభ న్యూస్) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నాందేడ్ జిల్లా ఇంచార్జిగా ఎంపీ ధర్మపురి అరవింద్ కు బాధ్యతలు అప్పగించిన నేప‌థ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 9 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

ఎంపీ ధర్మపురి అరవిందుకి నాందేడ్ జిల్లా బీజేపీ నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా భాజపా నాయకులు, కార్యకర్తలకు ధర్మపురి అరవింద్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్ర‌జ‌ల‌కు ప్రతి కార్యకర్త అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి అశోక్ చవాన్, రాజ్యసభ సభ్యులు మరట్వాడ ప్రభారీ భాగవత్ జీ కరాడ్, మర ట్వాడ విభాగ సంఘటన మంత్రి సంజయ్ జీ కౌడ్గేమాజీ పార్లమెంట్ సభ్యులు ప్రతాప్ రావు పాటిల్ చిక్లీకర్, శ్రీ రామ్ పాటిల్ రాథోళీకర్ , శ్రీ దేవిదాస్ రాథోడ్, నాందేడ్ దక్షిణ, ఉత్తర జిల్లాల అధ్యక్షులు సంతు ల్ రావ్ హంబరడే, కిషోర్ దేశ్ ముఖ్, మహి ళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పూనమ్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement