Sunday, September 8, 2024

సంఘ అభివృద్ధికి పాటుపడాలి : ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 9 (ప్రభ న్యూస్) : నూతన కార్యవర్గ సభ్యులు సంఘం కీర్తిని పెంచేలా సేవ ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని.. ఎప్పటిలాగే మీకు సహకారం అందిస్తానని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో అడహక్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథం శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి బూరుగుపల్లి మల్లేష్. కోశాధికారి సిద్ధంశెట్టి విజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ బ్రాహ్మన్లపల్లి బాల్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్య పట్టణ సంఘం, అనుబంధ సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీ నారాయణ గుప్తాలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసి జై వాసవి.. జైజై వాసవి వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల స్వాగతం నృత్యం అలరించింది. అనంతరం ముఖ్య అతిథులు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షులుగా కొండ వీరశేఖర్ గుప్తా, మాణిక్ భవన్ సంఘం నూతన అధ్యక్షులుగా ధన్పాల్ శ్రీనివాస్, యువజన సంఘం నూతన అధ్యక్షులుగా ఇల్లందు ల ప్రభాకర్ గుప్తా వైశ్య భవన్ నూతన కమిటీ అధ్యక్షులుగా చందూరు ధర్మేంద్ర గుప్తా, కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ నూతన అధ్యక్షులుగా పెండ్యాల శ్రీనివాస్ (వాసు) గుప్తా, గ్రాడ్యుయేట్ సంఘం (ఆవో గా) అధ్యక్షులుగా కుకుట్ల నవీన్ కుమార్ గుప్తా, ఆర్యవైశ్య మండలి నూతన అధ్యక్షురాలిగా దొంతుల ధనలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారులుగా, కార్యవర్గ సభ్యులుగా తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవులు మనపై మరింత బాధ్యత పెంచుతాయి.ఐక్యత గా ఉంటూ పెద్దల సలహాతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లండి అని తెలిపారు.16 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత జరిగిన ఎన్నికలలో గెలిచిన సభ్యులు ఆర్యవైశ్య సంఘం ఐక్యతకు,ఉన్నతికి అభివృద్ధికి కృషి చేయాలి, సంఘంలో ఎలాంటి సమస్య వచ్చినా కోర్టు వరకు వెళ్లద్దని తెలిపారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించు కోవాలని పిలుపునిచ్చారు. ఎవరైనా కోర్టు దాకా వెళితే వారిని సంఘం నుంచి బహిష్కరించాలని పేర్కొన్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : ధన్పాల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆర్యవైశ్య కుటుంబంలో మధ్య తరగతి పేదవారు నలిగి పోతున్నారని అటువంటి కుటుంబాల అండగా ఉందా మన్నారు సంఘ సభ్యులు ఆర్యవైశ్య పేదలను గుర్తించాలన్నారు అనంతరం నూతన కార్యవ ర్గాన్ని ముఖ్య అతిథులు శాలువాతో ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రవి గుప్తా, మూఢ నాగభూషణం గుప్త, అర్వపల్లి పురుషోత్తం గుప్తా, కార్పొరేటర్లు బురుగుపల్లి కల్పన మల్లేష్ గుప్తా,ఇళ్లేందుల మమత గుప్తా, పాల్తీ రవి కుమార్ గుప్తా, మంకాలి విజయ్ గుప్తా, కసుబా సంపత్ గుప్తా,కంచర్ల సంతోష్ గుప్తా, గరిపల్లి ప్రవీణ్ గుప్తా, ఇంగు శివ ప్రసాద్ సంపత్, ఇల్లెందుల సుధాకర్, వైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement