Tuesday, September 17, 2024

NZB: పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి..

జోన్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కార్పొరేషన్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 17(ప్రభ న్యూస్) : సమయపాలన పాటిస్తూ పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ సూచించారు. శనివారం ఉదయం నగరంలోని పారిశుద్ధ్య పనులను కార్పొరేషన్ కమిషనర్ పరిశీలించారు.

పూలాంగ్, గోల్ హనుమాన్ జోన్ కార్యాలయాలను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో హాజరు పట్టికను రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. అనంతరం ఆర్సపల్లి రైల్వే గేట్ గ్రావెల్ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement