Saturday, September 7, 2024

NZB: కార్గిల్ విజయ్ దివస్ లో పాల్గొన్న ప్రియాంక ధర్మపురి…

నిజామాబాద్ ప్రతినిధి, జులై 25(ప్రభ న్యూస్) : 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జమ్మూకాశ్మీర్ స్టడీ సర్కిల్ వారి ఆధ్వ ర్యంలో గురువారం సీఎంఆర్ సెంట్రల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ సతీమణి ప్రియాంక ధర్మపురి పాల్గొన్నారు. అమర వీరుల స్మృతిలో మొక్కను నాటారు.

అనంతరం కార్గిల్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ సి ఎస్ఎల్.వి.సుబ్రహ్మణ్యం, ఎయిర్ కమాండర్ వి.ఏం రెడ్డి, బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై కుప్పుస్వామి, ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ కుమార్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement