Friday, October 18, 2024

NZB: సమాజ సేవలో భాగస్వాములవడం అభినందనీయం.. జడ్జి సునీత కుంచాల

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 22(ప్రభ న్యూస్) : సమాజ సేవలో భాగస్వాములవ్వడం అభినందనీయమని జిల్లా జ‌డ్జి సునీత కుంచాల కొనియాడారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి జిల్లా సునీత కుంచాల ముఖ్యఅతిథిగా హాజరై సెక్స్ వర్కర్లకు, ట్రాన్స్ జెండర్లకు నాలుగు నెలలకు సంబంధించిన ఉచిత బియ్యాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిలో సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి, స్నేహ సొసైటీ సిద్దయ్య, డి ఎల్ ఎస్ ఏ సూపరింటెండెంట్ ఆర్.వి. పురుషోత్తం, పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement