Saturday, September 14, 2024

NZB: బంగ్లాదేశ్ లో అరాచకాలపై… విధులు బహిష్కరించిన న్యాయవాదులు

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 14(ప్రభ న్యూస్) : బంగ్లాదేశ్ లో హిందువులపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులను బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బంగ్లాదేశ్ అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆఫ్ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో విధులను బహిష్కరిస్తున్నట్టు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్ట్ ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ… బంగ్లాదేశ్ అరాచకాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. రిజర్వేషన్ ఉద్యమంగా ప్రారంభమై మతోన్మాద తీవ్రవాదులు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పిస్తూ హిందువులపై పథ‌కం ప్రకారం దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వం చొర‌వ‌ తీసుకొని అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం.రాజేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, సంయుక్త కార్యదర్శి దంపల్ సురేష్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు పడిగల వెంకటేశ్వర్, యెర్రం విఘ్నేష్, తుల గంగాధర్, మానిక్ రాజ్, బిట్ల‌ రవి, విశ్వక్ సేవ్ మధు, అరెటి నారాయణ, దేవదాస్, పుణ్యారాజ్, బాలాజీ, ఆశ నారాయణ, రావిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement