Friday, October 18, 2024

పెళ్ళి వేడుకలో 86మందికి కరోనా..

నిజామాబాద్ : ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం రేగింది. ఈ సంఘటన వర్ని మండలం సిద్దాపూర్‌లో చోటు చేసుకుంది. పెళ్లికి హాజరైన వారిలో 86 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సిద్దాపూర్‌ గ్రామంలో మూడు రోజులుగా పరీక్షల క్యాంప్ నిర్వహిస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లో 865 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ క్వారన్‌టైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement