Saturday, September 7, 2024

మాకు న్యాయం చేయండి సార్.. కలెక్టరేట్ ను ముట్టడించిన రామన్నపేట గ్రామస్తులు

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామస్తులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ కు తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడి చేశారు. సుమారు వెయ్యి మంది వరకు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడి రాకపోకలు స్తంభించాయి. రామన్నపేట గ్రామంలో ఐదు ఎకరాల ముప్పై గుంటల భూమికి సంబంధించిన విషయమై మాకు న్యాయం చేయాలంటూ బిష్మించుకొని కూర్చున్నారు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని కరాకండిగా చెప్పారు. ఒక వర్గం వారు మా గ్రామంలో భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి భూమికి సంబంధించిన విషయమై విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement